ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 28న భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభించేందుకు జిల్లా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది.

వరంగల్ భద్రకాళి, హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు, ధర్మసాగర్ రిజర్వాయర్లో బోటు షికారును నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. అయితే ముందుగా భద్రకాళి చెరువులో ప్రారంభం కానుంది. పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చార్జీగా నిర్ణయించారు.