తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 28వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.
హైదరాబాద్లోతో పాటు GHMC పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు GHMCలో జరిగే నిమజ్జనాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.