సంఘటనలు

1854: భారతదేశంలో తపాలా బిళ్ళల ప్రసరణ మొదలయ్యింది. బిళ్ళల పై రాణి విక్టోరియా గారి మొహం ఇంకా భారతదేశం చిత్రాలు ఉండేవి. వాటి అప్పటి వెల సగం ఆణ (రూ. 1/32)


1864: కలకత్తాలో తుఫాను వలన 70,000 మంది మరణించారు.


1880: శ్రీలంకలో భారతదేశంతో ద్రవ్య మార్పిడి మొదలయ్యింది.


1892: భారత రెండు అన్నా నాణెం చెల్లదు ఇంకా శ్రీలంకలో వెండి నాణేలు ప్రవేశపెట్టబడ్డాయి.


1926: బల్కంజీ బారి ఇనిస్టిట్యూట్ పిల్లల సంక్షేమం కోసం స్థాపించబడింది.


1932: ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలయిన రోజు(రైసింగ్డే).


1932: భారతీయ భాగస్వామ్య చట్టం, 1932 అమలులోకి వచ్చింది.


1949:’మరాఠీ రంగభూమి’ అనే నాటక సంస్థ స్థాపించబడింది.


1953: కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.


1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, బరువుల కొలతల కోసం ప్రవేశ పెట్టారు.


1959: గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.


1966: భారత పర్యాటక అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.


1978: బాల్య వివాహ చట్టంలో, వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 సంవత్సరాలు మరియు ఆడవారికి 18 సంవత్సరాలు పెంచబడింది.


1981: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సూత్రధారి దాల్ ఖల్సా కార్యకర్తలను అరెస్టు చేశారు.


1982: తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.
1984: బజరంగ్ దళ్ అన్న హిందూ మత సంస్థ స్థాపన.


1990: పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించడానికి రాజ్యాంగం యొక్క 75వ సవరణ బిల్లు సాధారణ మెజారిటీ కోసం లోక్‌సభలో మొదటి దశలో విఫలమైంది.


1990: జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


1990: మండల్ కమిషన్ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.


1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.


2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.


2001: కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు.


2003: అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యాహత్నం.


2006: పాండిచ్చేరి రాష్ట్రం పేరు పుదుచ్చేరిగా మార్చబడింది

జననాలు

1542: మరియం-ఉజ్-జమాని, ముఘల్ చక్రవర్తైన అక్బర్ భార్యలలో ఒకరు.

1842: సుబ్బియర్ సుబ్రహ్మణ్య అయ్యర్, భారత న్యాయవాది, న్యాయనిపుణుడు (మ. 1924)

1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)

1861: నీల్ రతన్ సర్కార్ , బ్రిటిష్ భారతీయ వైద్యుడు మరియు విద్యావేత్త. ( మ. 1943 )

1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)

1887: పండిట్ హృదయనాథ్ అజుధియనాథ్ కుంజ్రు, రాజకీయవేత్త మరియు సామాజిక కార్యకర్త.

1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.

1894: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977)

1895: లియాఖత్ అలీ ఖాన్ , భారత-పాకిస్తానీ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు, పాకిస్తాన్ 1వ ప్రధానమంత్రి (మ. 1951)

1901: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.

1904: ఎ. కె. గోపాలన్ , భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త (మ. 1977)

1906: సచిన్ దేవ్ బర్మన్, భారతీయ స్వరకర్త మరియు గాయకుడు (మ. 1975)

1906: నికుంజ సేన్ , భారత స్వాతంత్ర్య పోరాట విప్లవకారుడు, రైటర్స్ బిల్డింగ్స్ క్యాంపెయిన్ వ్యవస్థాపకుడు. (మ. 1986 )

1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)

1913: జనరల్ హర్బక్ష్ సింగ్, పద్మ విభూషణ్ మరియు వీర చక్ర అవార్డు పొందిన భారతీయ సైనిక అధికారి.

1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)

1918: గోవిందప్ప వెంకటస్వామి , భారతీయ నేత్ర వైద్యుడు (మ. 2006)

1919: మజ్రూహ్ సుల్తాన్‌పురి , భారతీయ కవి మరియు పాటల రచయిత (మ. 2000)

1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974)

1922: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004).

1928:శివాజీ గణేశన్, తమిళ సినీ నటుడు (మ. 2001 )

1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.

1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014)

1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)

1942: బోయ జంగయ్య, రచయిత. (మ.2016)

1945: రామ్ నాథ్ కోవింద్ , 14వ భారత రాష్ట్రపతి.

1947: దల్వీర్ భండారీ , భారతీయ న్యాయవాది మరియు న్యాయమూర్తి.

1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)

1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త, మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు.

1969: మహేష్ ఠాకూర్, భారత నటుడు.

1984: వినీత్ శ్రీనివాసన్ భారత గాయకుడు, నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత.

1990: అనుష్క రంజన్, భారత నేటి, మోడల్.

1998: జెహాన్ దారువాలా, భారత ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్

మరణాలు

1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)

1946: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902)

1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)

1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)

1986: వీర్ చంద్ర సింగ్ గర్వాలీ, భారతదేశ విప్లవకారుడు.

1995: ఆదిత్య విక్రమ్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త.

1997: గుల్ మొహమ్మద్, తను ఉన్నప్పటి కాలంలో ధృవీకరించబడిన అత్యంత పొట్టి మనిషి.

2022: తులసీ తాంతీ, భారతీయ వ్యాపారవేత్త. (జ. 1958)

పండుగలు, జాతీయ దినాలు

ప్రపంచ శాఖాహార దినోత్సవం.

ప్రపంచ వృద్ధుల దినోత్సవం.

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం.

జాతీయ రక్తదాన దినోత్సవం.

సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్ర్య దినోత్సవం.

ప్రపంచ ఆవాస దినోత్సవం.

స్వచ్ఛంద రక్తదాన దినం.

అంతర్జాతీయ సంగీత దినం.