తిరుపతి ఐఐటీ తొలి దశ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సంస్థకు సంబంధించి సివిల్ పనులు, సామగ్రి, ఫర్నిచర్ కోసం ఇప్పటి వరకు రూ.1091.75 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఇటు విశాఖలోని అగనంపూడి టోల్ ప్లాజాను తొలగించలేదని కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు.