ప్రశ్నాపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.

60 పోస్టులను చేర్చి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. అలాగే 15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. అటు నిరుద్యోగులు నష్టపోకుండా వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.