ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వుడ్ కేటగిరీల్లో 33 1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. దీంతో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు వర్తించవు. రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో TSPSC సహా ఇతర నియామక బోర్డులు ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి.