బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో అవకతవకలు జరిగాయని కాగ్ నివేదికలో తేల్చింది.
చనిపోయినవారికి గొర్రెలు పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేసినట్లు పేర్కొంది. ఈ స్కీంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపింది. రూ.253.93 కోట్ల వినియోగంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నకిలీ రవాణా ఇన్వాయిస్లతో రూ.68 కోట్లు, గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో రూ.92కోట్లు స్వాహా చేసినట్లు వెల్లడించింది.