చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే…
ఒక్క గవర్నమెంట్ జాబ్ సాధించడమే ఎంతో కష్టం అనుకుంటే ఇక్కడ మాత్రం ఇద్దరు మహిళలు ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
వరంగల్ మధ్య కోటకు చెందిన బండి హిమబిందు, ధర్మారానికి చెందిన కొప్పుల చైతన్య గత ఏడాది గురుకుల నియామక పరీక్షలు రాశారు. జూనియర్ డిగ్రీ కాలేజీలు స్కూల్ విభాగాల్లో ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
వీటిలో డిగ్రీ లెక్చరర్ పోస్టును ఎంచుకున్నారు. తాజాగా పాలిటెక్నిక్ కాలేజీలో లైబ్రరీ సైన్స్ పోస్ట్ కి కూడా సెలక్ట్ అయ్యారు ఈ ఇద్దరు మహిళలు. ఏకంగా ఒక్కరికి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలా అంటూ అందరూ షాక్ అవుతున్నారు.