మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని, వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో విత్తనాలు వేసే జూన్, జులై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు.