కొత్త కరెన్సీ నోటుపై ఏమైనా రాస్తే అది చెల్లదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో గత కొద్ది కాలంగా వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది.

మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఇప్పటికీ చాలా లావాదేవీలు నోట్ల ద్వారానే జరుగుతున్నాయి. దీంతో అటు వ్యాపారులు కస్టమర్లు ఇద్దరు ఆందోళనకు గురవుతున్నారు.

మరి దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం…

PIB ఫ్యాక్ట్ చెక్ వైరల్ సందేశాన్ని పరిశోధించినప్పుడు, RBI పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ పూర్తిగా ఫేక్ అని పెన్నుతో వ్రాసిన నోట్లు చెల్లవు అనేది అబద్ధమని PIB ఫ్యాక్ట్ చెక్ తన విచారణలో తెలిపింది.

క్లీన్ నోట్ పాలసీ ప్రకారం, కరెన్సీ నోట్లపై ఏమీ రాయొద్దని, అలా చేయడం వల్ల నోట్లు పాడైపోయి, అవి చిరిగిపోయే ప్రమాదం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.