మత్య్సకారులు ఒడిశాలోని తీరంలో చిన్న కెమెరా, మైక్రోచిప్తో అమర్చబడిన ఓ పావురాన్ని తమ బోట్లో గుర్తించారు. వెంటనే జగత్సింగ్పూర్లోని పారాదీప్ మెరైన్ పోలీసులకు అప్పగించారు.
దానిని పరీక్షించిన పోలీసులు.. పావురం రెక్కపై కోడ్ నంబర్తో మెసేజ్ ఉన్నట్లు, పావురాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని… దానికి అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ సహాయం తీసుకుంటామని జగత్సింగ్పూర్ ఎస్పీ రాహుల్ తెలిపారు.
దీనిని గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.