తెలంగాణలో ఒంటి పూట బడులకు వేళయ్యింది.
వాతావరణం మారుతున్న తరుణంలో తెలంగాణ సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
2022-23 విద్యా సంవత్సరం చివర పని దినం ఏప్రిల్ 24 వరకూ అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉన్నందున ప్రతిరోజూ ఉదయం 7.45 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ తరగతులు నివహిస్తారు. వేసనిలో అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది.
పబ్లిక్ ఎగ్జామ్స్ నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థలు విషయంలో మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవులు ఉంటాయి.
తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు రీ ఓపెన్ అవ్వనున్నాయి.
అకడమిక్ ఇయర్ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ షెడ్యూల్ నడుస్తుందని అధికారులు చెప్తున్నారు.