మేడ్చల్ జిల్లా బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ విలేజ్‌ ఏరియాలో విద్యార్థిని ఆత్మహత్య  విషాదం నింపింది.

బేగంపేటలోని గర్ల్స్ డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్‌ చదువుతున్న పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది.

ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యువతి.. సడెన్‌గా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది.

చదువుపై శ్రద్ద పెట్టలేకపోతున్నానని.. ఆ డిప్రెషన్‌తోనే చనిపోతున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

సూసైడ్‌ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.