ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.

ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు కవితకు మద్ధతుగా రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి నేతలు ఢిల్లీకి భారీగా చేరుకున్నారు.

ఇప్పటికే న్యాయ నిపుణులతో మంత్రులు కేటీఆర్, హరీష్ చర్చలు జరిపారు.

ఆందోళన చేసే ఛాన్స్ ఉండటంతో.. ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్ నివాసం, ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే, ఈడీ విచారణకు కన్‌ఫ్రంటేషన్‌ విధానంలో బుచ్చిబాబు, పిళ్లై, సోసిడియాతో కలిపి కవితను విచారించే అవకాశం కనిపిస్తోంది.