ఏపీ సర్కార్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
విద్యా దీవెన పథకం నిధులు మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్.
వాస్తవానికి ఈ నెల 18న జరగాల్సి ఉండగా.. అదేరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉండగా విద్యార్థులు ఇబ్బంది పడతారని, 19కి వాయిదా వేశారు.
జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద అర్హులైన పేద విద్యార్థులందరికీ సర్కార్ పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ సర్కార్. జగనన్న వసతి దీవెన స్కీమ్ కింద ఏటా 2 వాయిదాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందజేస్తోంది. అలాగే ఐటీఐ స్టూడెంట్స్కు రూ.10 వేలు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు రూ.15 వేలు ఇస్తుంది.