కర్నాటకలోని దావణగెరెకు ప్యాసింజర్ల వినతుల మేరకు ఆర్టీసీ కొత్త సూపర్ లగ్జరీ బస్సును శుక్రవారం ఈ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు.
హైదరాబాద్ మియాపూర్ నుంచి రోజూ సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరుతుంది.
ఈ కొత్త సర్వీస్ కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, ఎంజీబీఎస్, మహబూబ్ నగర్, రాయచూరు, సింధనూరు, గంగావతి, హోస్పేట్ మీదుగా వెళ్తుంది. దావణగెరె నుంచి రోజూ సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయలుదేరుతుంది.
ఈ బస్సు ఛార్జీలు మియాపూర్ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్ నుంచి రూ. 840 వసూలు చేస్తారు.
కర్ణాటకలోని దావణగెరెకు తెలంగాణ నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ దృష్ట్యా దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీసును ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
దావణగెరెకు టికెట్ బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.