అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ మాట్లాడుతూ, ఫీజుల పేరిట పదవ తరగతి విద్యార్థులకు, పలు ప్రయివేట్ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే మా అఖిల భారత ప్రగతి శీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై భౌతిక దాడులు చేయడానికి వెనుకాడబొమని ఏ ఐ పి ఎస్ యు మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు పలు ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం ను హెచ్చరించారు. హాల్ టికెట్స్ ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే, తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఏ ఐ పి ఎస్ యు జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ గారు ఒక ప్రకటన లో తెలిపారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా హాల్ టికెట్స్ విషయం లో ఇబ్బంది పడితే ఈ క్రింది నెంబర్ కి సంప్రదించాలని ఆయన అన్నారు. (9885588299, 8466806702.)

ఈ కార్యక్రమం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు రమేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.