జగిత్యాల జిల్లా కేంద్రం

సెర్ఫ్ ఉద్యోగుల మాదిరిగానే ఉపాదీహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గడ్డం రమేష్ డిమాండ్ చేశారు.

తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్ మాట్లాడారు. సుమారు గత 16 సంవత్సరాలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారని తెలిపారు.

గ్రామాల్లో పేద కూలీలకు అవసరమైన పనులు కల్పించి వలసలను అరికట్టామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో నిరంతరం కష్టపడి పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం గుర్తించి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లు పేస్కేల్ అమలు చేయాలని కోరారు.

ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు పొన్నం రాజు గౌడ్, కేర్ శ్రీనివాస్, కొలిపాక రాజు, తోట్ల శంకర్, లక్ష్మణ్, రాజు, వివిధ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.