తిరుమలేశుని భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీని జమ చేయడంలో తీవ్ర స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించిన RBI, TTD దేవస్థానం బోర్డుకు రూ.3 కోట్ల మేరకు జరిమానా కూడా విధించింది.
భక్తులు హుండీలో సమర్పించుకునే విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేసేటప్పుడు విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని పట్టించుకోలేదని, TTD ఎఫ్.సిఆర్.ఏ లైసెన్స్ 2018లోనే ముగియగా, ఇతరత్రా కారణాల వల్ల రెన్యువల్ చేయించక పోవడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
ఈ జరిమానాను చెల్లించినట్లు TTD బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.