కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని రకాల వస్తువుల ధరలు ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై-గ్లోస్ పేపర్, విటమిన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు లాంటి వస్తువలతో పాటు సిగరెట్లు, బంగారం, ప్లాటినం లాంటి వస్తువులు, వీటితో పాటు పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా భారీగా పెరగున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన టైంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు.

కొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆ జాబితాలో కెమెరా లెన్స్‌లు, మొబైల్ ఫోన్‌లు, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలు, లిథియం – అయాన్ బ్యాటరీల కోసం ఉపయోగించే మెషీన్లు, ఈవీ ఇండస్ట్రీకి సంబంధించిన ముడి పదార్థాలు, ఆటవస్తువులు, బైస్కిల్స్, టీవీ, మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎల్ఈడీ టీవీలు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాల ధరలు తగ్గనున్నాయి.

ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.