దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ది చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రేపు జరగనున్న సీతారాములోరి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి రామయ్యను దర్శించుకుని, శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేపు భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామనవమి పుష్కర పట్టాభిషేకము ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు.

తర్వాత భ‌క్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి గారు.