చౌద క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 ను ప్రారంభించిన అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారు.

యువత అన్ని రంగాల్లో రాణించాలి..

ఐజ మున్సిపాల్టీ లోని డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చౌద క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఈరోజు అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ గారి చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగినది.

ఈ సందర్బంగా కిషోర్ గారు మాట్లాడుతూ..

ఈ దేశ భవిష్యత్తు యువతచేతుల్లోనే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది గనుక యువకులు బాధ్యతగా వ్యవహరించి క్రీడల్లోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా యువత రాణించాలని దేశ విదేశాలలో నా భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంచే బాధ్యత యువత తీసుకోవాలని యువతకు సందేశం ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం ఉంటుందని ఈ టోర్నమెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు కూడా వారు తెలియజేయడం జరిగినది.

ఈ కార్యక్రమానికి సహకరించి మొదటి బహుమతి 50116/- రూ ఇచ్చిన కిషోర్ అన్న గారికి మేనేజ్మెంట్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది..

ఈ సందర్భంగా కిషోర్ అన్న గారికి ఘన స్వాగతం పలికారు అనంతరం శాలువా పూలమాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏలీయాజార్, 4వ వార్డ్ కౌన్సిలర్ నాగమ్మ, ఆనంద్, ప్రభాకర్, తిపన్న, నవీన్,శిఖమని, రాముడు, ఆరెపల్లి రాము, బింగిదొడ్డి రాంకోటి, వీరేష్, జీవన్, కార్తీక్, లక్ష్మన్న, హిజ్రాయిల్ హుస్సేన్, రవి, బిసన్న, పాండు, మెసేక్, దినకర్,సందీప్, నాగరాజు, పూలన్న, రాజు, నాగరాజు, రాజేష్ సూరి, కృష్ణ, చందు, మీ సేవ రాజేష్, సూర్య చంద్ర, యెబు,వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు BRS పార్టీ నాయకులు మరియు కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.