జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో ఆదివారం ఈత కోసం వెళ్ళిన తండ్రి కూతురు మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్ళితే…

ఐజా మండలం తూముకుంట గ్రామానికి చెందిన రాములు (40) తన కుటుంబంతో కలిసి బంధువుల మామిడి తోటలో పనిచేస్తూ ఉన్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో తన కూతురు వెన్నెల (7), కుమారుడికి ఈత నేర్పేందుకు సమీపంలో ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. కుమారుడిని గడ్డ పైన ఉంచి ముందుగా తన కూతురికి ఈత నేర్పించేందుకు బావిలోకి దిగాడు ఆ బాలిక భయపడి తండ్రి గొంతు గట్టిగా పట్టుకోవడం… ప్రమాదం నుండి బయటపడేందుకు అవకాశం లేకపోవడం తో తండ్రి కూతురు బావిలో మునిగిపోయారు.. గడ్డమీద ఉన్న బాలుడు తన తండ్రి ,సోదరి నీటిలో మునిగిపోయారు అని అక్కడ ఉన్నవారికి చెప్పారు. అక్కడికి వచ్చి చూసేసరికి నీటిమడుగులో మునిగిపోయినట్లుగా గుర్తించారు స్థానికులు మరియు అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారికి విషయం తెలిపారు అనంతరం ఎమ్మెల్యే గారు తక్షణమే ఫైర్ శాఖ అధికారులు మరియు పోలీస్ శాఖ వారితో చరవనిలో మాట్లాడి నీటిని మోటార్ల సాయంతో తోడేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అప్పటికే మృతి చెంది ఉన్నారు పోస్ట్ మార్టం కోసం గద్వాల్ జిల్లా ఆసుపత్రికి తరలించరు ఎమ్మెల్యే గారు అక్కడికి చేరుకొని పోస్ట్ మార్టం త్వరగా పూర్తి చేయాలని డాక్టర్స్ కు సూచించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ప్రమర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.