జోగులాంబ గద్వాల జిల్లా
✍️కురువ పరుశురాo
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో ఆదివారం ఈత కోసం వెళ్ళిన తండ్రి కూతురు మృతి చెందారు.
అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ తెలుగు పేటకు చెందిన BRSపార్టీ నాయకులు తెలుగు ఆంజనేయులు గారి తమ్ముడు రాములు(40) తన కుటుంబంతో కలిసి బంధువుల మామిడి తోటలో పనిచేస్తూ ఉన్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో తన కూతురు వెన్నెల (7), కుమారుడికి ఈత నేర్పేందుకు సమీపంలో ఉన్న బావి దగ్గరకు వెళ్ళాడు. కుమారుడిని గడ్డ పైన ఉంచి ముందుగా తన కూతురికి ఈత నేర్పించేందుకు బావిలోకి దిగాడు ఆ బాలిక భయపడి తండ్రి గొంతు గట్టిగా పట్టుకోవడం… ప్రమాదం నుండి బయటపడేందుకు అవకాశం లేకపోవడం తో తండ్రి కూతురు బావిలో మునిగిపోయి మరణించారు.
వారి భౌతిక కాయలకు పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతినితెలిపిన జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య