కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ల ఆటలు కట్టించినా ఎయిర్ పోర్టులన్నీ అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు అడ్డాలుగా మారుతున్నాయి. స్మగ్లర్లు పద్ధతులను కనుగొంటూనే ఉన్నారు.
తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్యాసింజర్ చేతిలో అనుమానాస్పదంగా కన్పించిన బ్యాగ్ ను అధికారులు తనిఖీ చేయగా… స్క్రూస్ రూపంలో అరకిలో బంగారం అమర్చినట్లు గుర్తించారు. వెంటనే బ్యాగ్ను సీజ్ చేసి ప్యాసింజర్ను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ రూ. 21.20 లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.