సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలలో పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న రోజే ధర్నా చేయాలని నిర్ణయించడం కొస మెరుపు.

మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియ నిర్వహించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.