సిద్దిపేట జిల్లా
✍️భైరవ్ రెడ్డి

సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన యాసంగి 2022-23 పంటకాలం వరి ధాన్యం సేకరణ- మద్ధతు ధర, పామ్ ఆయిల్ పంట సాగు, భూగర్భ జలాల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదిరెడ్డి, సతీష్ కుమార్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీసు కమిషనర్ శ్వేత, జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖాధికారులు పాల్గొన్నారు.