జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 17,2023

ప్రజాసాక్షి దినపత్రిక జగిత్యాల రిపోర్టర్ వడ్లకొండ శ్రీనివాస్ (45) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని సంవత్సరాలనుండి శ్రీనివాస్ పాత్రికేయ వృత్తిలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరునగరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ద్యావర సంజీవరాజు శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి,శ్రీనివాస్, సంజీవరాజులు మాట్లాడుతూ…

పాత్రికేయునిగా శ్రీనివాస్ అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. జయపాల్, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గుర్రం చంద్ర శేఖర్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కళాశ్రీ గుండేటి రాజు, రవీందర్ రావు, కాంతరావు, శ్రీనివాస్ రావు, మాకు రాజలింగం, చింత రోజా, ఆముద లింగారెడ్డి, శ్రీనివాస్, మానే రవీందర్, మహేంద్రనాథ్, సాగర్,పెండెం మహేందర్, కిషోర్, మోహన్ రావు తదితరులు శ్రీనివాస్ మృతిపట్ల సంతాపం తెలిపారు.