నిజాంపేట
✍️భైరవ్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి – టీయూడబ్ల్యూజె (హెచ్143) నేత సురేందర్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజె (హెచ్143) నిరంతరం కృషి చేస్తుందని జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు , టీయూడబ్ల్యూజె (హెచ్143) సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి తెలిపారు. గురువారం నిజాంపేట మండల కేంద్రంలో
సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జర్నలిస్టులు టియుడబ్ల్యూజె (హెచ్143)సభ్యత్వాన్ని తీసుకున్నారు.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కార్పస్ ఫండ్ కింద ప్రభుత్వం రూ 100 కోట్లు కేటాయించిందన్నారు. వాటి ద్వారా వచ్చే వడ్డీ తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. జిల్లాలో విడతల వారిగా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.కరోనా సమయంలో అనారోగ్యానికి గురైన జర్నలిస్టులను అదుకున్నామన్నారు. నిజాంపేట లో త్వరలోనే అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు అందేలా కృషి చేస్తామన్నారు.ఈ సందర్భంగా టియుడబ్ల్యూజె (హెచ్143) అనుబందంగా నూతన ప్రెస్ క్లబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే నాయకులు బల్ల యాదగిరి తదితరులు ఉన్నారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సంజీవ్ ఏకగ్రీవ ఎన్నిక

నిజాంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా దుబాషి సంజీవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా జీడీ చంద్రకాంత్ గౌడ్,ప్రధాన కార్యదర్శి గా పెద్దబోయిన స్వామి,కోశాధికారిగా పప్పుల భరత్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు బండారి సిద్ధరాములు,వెంకట్ రెడ్డి,ప్రదీప్ రెడ్డి లు ఉన్నారు.