సిద్దిపేట జిల్లా కేంద్రం
✍️భైరవ్ రెడ్డి
పోలీస్ అధికారులకు సిబ్బందికి స్పోర్ట్స్ మీట్స్ భాగంగా ఈరోజు బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ మేడమ్ క్రికెట్, వాలీబాల్, బ్యాట్మెంటన్, క్రీడలను క్రికెట్ సిద్దిపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్, వాలీబాల్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, బ్యాట్మెంటన్ వేములవాడ కమాన్ రోడ్ ఇండోర్ స్టేడియం లలో టాస్ వేసి లాంచనంగా ప్రారంభించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ మేడం గారు మాట్లాడుతూ…
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి మానసిక ఉల్లాసం స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శరభేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియంలో టాస్ వేసి గేమ్స్ ప్రారంభించి మరియు బ్యాట్మెంటన్ ఆడి అధికారులను సిబ్బందిని ఉత్సవపరిచార
అధికారులు సిబ్బంది మానసిక ఉల్లాసం, ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్, యోగ మరియు స్పోర్ట్స్ ఆడుతూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, ఈ ప్రపంచంలో ఆరోగ్యానికి మించింది మరొకటి లేదని, మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఈ పోటీలు వారం రోజులపాటు జరుగుతాయని, ఫైనల్ లో గెలుపొందిన విన్నర్, రన్నర్స్ టీమ్స్ కు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫ్రెండ్లీగా, స్పోర్టివ్ గా తీసుకుని ఆడాలని సూచించారు. వేసవికాలం అయినందున స్పోర్ట్స్ ఆడే అధికారులకు సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్ఐ అడ్మిన్ శ్రీధర్ రెడ్డికి సూచించారు.
బ్యాట్మెంటన్ డబుల్స్ (20- టీమ్స్)
బ్యాట్మెంటన్ సింగిల్ (20- టీమ్స్) పోలీస్ అధికారులు సిబ్బంది కోరిక మేరకు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది క్రికెట్ టీమ్స్ కు ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి లైజనింగ్ అధికారిగా నియమించడం జరిగింది. వాలీబాల్ టీమ్స్కు ఆర్ఐ రామకృష్ణ లైజనింగ్ అధికారిగా గా నియమించడం జరిగింది.
బ్యాట్మెంటన్ టీమ్స్ కు టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ను లిజనింగ్ అధికారిగా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలోఅడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచందర్ రావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, టూ టౌన్ సీఐ రవికుమార్, త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్, మరియు పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.