జగిత్యాల జిల్లా
పొలాస మండలం
ఏప్రిల్ 18,2023

జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని సహస్ర లింగాల దేవాలయంలో మంగళవారం మాస శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వుటూరి అశోక్ బాబు-రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో సహస్ర లింగాల దాతలు, వేలమంది ఏక కాలంలో అన్నపూజ చేసినందుకు వండర్ బుక్ అఫ్ రికార్డ్ అవార్డు సొంతం చేసుకున్నారు.


జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఉటూరి అశోక్ బాబు, రమాదేవి దంపతులు సహస్ర లింగాలకు మంగళవారం ఏకకాలంలో అన్నపూజ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి సహస్రలింగాల దేవాలయం చేరుకుని, సహస్ర లింగాల దాతలు ఏక సమయంలో అన్న పూజా కార్యక్రమం చేయగా ఈ విషయం గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ ఏ.గంగాధర్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డును అశోక్ బాబు రమాదేవి దంపతులకు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అశోక్ బాబు దంపతులను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సహస్ర లింగాల దేవాలయం ఫౌండర్ నలుమాసు గంగాధర్ ,ఆలయ ట్రస్టు సభ్యులు, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.