జగిత్యాల జిల్లా
కోరుట్ల
ఏప్రిల్ 18,2023
2023-2024 సంవత్సరానికి కోరుట్ల బార్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సీనియర్ న్యాయవాదులు గంగుల సత్యార్థ ప్రకాష్, గంగుల రాంగోపాల్, తోకల రమేష్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బద్ది నర్సయ్య , ప్రధాన కార్యదర్శిగా బైరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కొంపల్లి సురేష్,కోశాధికారిగా చిలివేరి రాజశేఖర్ తోపాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.