మెదక్ జిల్లా
రామాయంపేట
✍️భైరవ్ రెడ్డి

బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమావేశం స్థానిక మధుర గార్డెన్ లో రామాయంపేట పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మైలై శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి హాజరైనారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఉచిత కరెంటు ఆడపిల్లల పెళ్ళికి కల్యాణ లక్ష్మి షాది ముబారక్ రైతు సంక్షేమం కోసం రైతు బీమా రైతు బంధు దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రవేశపెట్టడం జరిగింది రాబోయే కాలంలో సొంత ఇంటి స్థలం ఉన్న వారికి 3 లక్షల రూపాయల నగదు అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీస్ నుంచి మధుర గార్డెన్ వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మహిళలతో కలిసి నృత్యం చేశారు ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి పట్టణ బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు గజవాడ నాగరాజు రామయంపేట మండల్ రూరల్ బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి కౌన్సిలర్ దేవుని జయరాజు చంద్ర శోభ కొండల్ రెడ్డి పిఏ సిసి చైర్మన్ బాదే చంద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.