సిద్ధిపేట జిల్లా కేంద్రం
✍️భైరవ్ రెడ్డి

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సర్వజన ఆసుపత్రిలో డే కేర్ కీమో థెరపీ సెంటరు ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…

రాష్ట్రంలో మొట్టమొదటి డే కేర్ కీమో థెరపీ సెంటర్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. సిద్దిపేటతో పాటు ఖమ్మం, కరీంనగర్, వనపర్తి, సిరిసిల్లలో వీటిని మంజూరు చేసుకున్నాం, క్రమంగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో, ఆ తర్వాత 33 జిల్లాల్లో వచ్చే మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక ఉంది. కేన్సర్ వ్యాధి తీవ్రత ఉన్న పేషంట్లకు హైదరాబాద్ దాకా వెళ్లకుండానే, జిల్లాలోనే కీమో తెరపి సేవలు పొందుతారు. ఎంతో దూరం ప్రయాణించి, పని వదులుకొని రెండు మూడు రోజులపాటు కీమో సేవల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు ఇక ఇక్కడి సెంటర్ లో 4 పడకలు ఉంటాయి. ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రిలో శిక్షణ పొందిన ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్స్ లు ఉంటారు.

60 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవి ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రి నుండి ఇక్కడికి సరఫరా అవుతాయి. ఎం ఎం జే, నిమ్స్ ఆసుపత్రులు రిఫర్ చేసిన కేన్సర్ పేషెంట్లు ఇక్కడ కీమో థెరపీ సేవలు పొందవచ్చు. ప్రతి పేషెంట్ కి 6 నుండి 8 సైకిళ్ల కీమో అవసరం ఉంటుంది. పేషంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఒక్కో కీమో సైకిల్ కి 3 నుండి 4 వారాల గ్యాప్ అవసరం ఉంటుంది. ఒక్కో సైకిల్ నిర్వహించడానికి సగటున 5-6 గంటల సమయం పడుతుంది.

ఒక్కో సైకిల్ కి కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే కనీసం 40 వేల నుండి 50 వేల ఖర్చు అవుతుంది. మొత్తంగా 4 లక్షల విలువైన వైద్యం మీ చెంతనే ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రతి కీమో పేషెంట్ , ప్రతి సైకిల్ కి CBP, RFT, LFT పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

ఒక వేళ పేషంట్ డయాబెటిక్ అయితే, FBS AND PLBS పరీక్షలు, కార్డియాక్ కేస్ అయితే ECG and 2D ECHO వంటి పరీక్షలు చేస్తారు. Cancer Cases in Siddipet are 468 Breast Cancer-65
Cervical Cancer -125
Orall Cancer -66
Lung Cancer -30
Rectum cancer-15
Thyroid Cancer -08
Other Cancer Cases -159
నిమ్స్, ఎం ఎన్ జే ఆసుపత్రులు కీమో థెరపీ అవసరం అని, రిఫర్ చేసిన 96 కేసులు ఇక్కడ కీమో సేవలు పొందే అవకాశం కలిగింది.

వీరికి ఇక్కడి నుండి టెలి కన్సల్టేషన్ సేవలు కూడా అందుతాయి. కేన్సర్ ప్రాథమిక దశలో గుర్తించక పోవడం వల్ల, వ్యాధి ముదిరిన దశలో ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రులకు చేరుతున్నారు. కేన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం కాన్సర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది. ముందుగా గుర్తించడం, క్యాన్సర్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించడం.. వారిని కాపాడుకోవడం లక్ష్యంగా పని చేస్తుంది. జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నది. మారుమూల ప్రాంతాలకు సైతం మొబైల్ స్క్రీనింగ్ సేవలు చేరువ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సగటున సంవత్సరానికి రూ. 100 కోట్లతో కేన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలందిస్తున్నాము.

2014-15 లో 69 కోట్లు ఖర్చు చేస్తే, గతేడాది 120 కోట్ల దాకా ఖర్చు చేసాము. అంటే డబుల్ అయ్యింది. క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తంగా రు. 800 కోట్లు ఖర్చు చేసింది.

MNJ మరియు నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందించుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచుకుంటున్నాము. MNJ ఆసుపత్రి రు. 120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్ గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. 300 పడకల కొత్త బ్లాక్ ప్రారంభించి 750 పడకలకు విస్తరించుకున్నము, క్యాన్సర్ సోకిన వారిని కాపాడుకునేందుకు అవసరమైన అధునాతన చికిత్సలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తున్నది. ఎం ఎన్ జే, నిమ్స్ లో ఇప్పటికే ట్రు భీం, PET స్కాన్ వంటి అధునాతన పరికరాలు ఏర్పాటు చేయగా, ఢిల్లీలో నీ ఎయిమ్స్ తరహాలో రోబోటిక్ సర్జరీ చేసే ఎనిమిది అత్యాధునిక మాడ్యులర్ థియేటర్ల ప్రత్యేక బ్లాక్ నీ ఎం ఎన్ జే లో ఏర్పాటు చేసుకున్నాం, ప్రస్తుతం నిమ్స్, ఎం ఎన్ జేలో ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎముక మూలుగ మార్పిడి ( బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్) శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి అవసాన దశలో ఉన్నవారికి సేవలు అందించేందుకు ఉదేశించిన పాలియేటివ్ కేర్ సేవలను 33జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నాం, కేన్సర్ బాధితులకు ఇది అండగా నిలుస్తున్నది. వీరి కోసం ప్రత్యేకంగా ఆలనా వాహనాలను ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇలా ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ‌.
తెలంగాణ డయాగ్నొస్టిక్ పథకం ద్వారా జిల్లా స్థాయి లోనే కాన్సర్ ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ , బయాప్సీ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నాము.

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పథకం ద్వారా సాధారణ కాన్సర్ వ్యాధులను ప్రాధమిక దశలోనే గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము, ప్రజలలో అవగాహన కల్పించి కాన్సర్ రాకుండా అలవాట్లు మార్చు కోవడం (పొగాకు,సిగరెట్లు మానడం), ప్రాధమిక పరీక్షలు చేయించుకోవడం(రొమ్ము మరియు గర్భాశయం కు సంభందిత పరీక్షలు) ద్వారా వ్యాధి రాకుండా చూడడం & ఒక వేల వచ్చినా దానిని త్వరిత గతిన గుర్తించి చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము.

క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవితం అలవాటు చేసుకోవాలి. మూడింట రెండొంతుల క్యాన్సర్లు మన గతి తప్పిన ఆహార అలవాట్లు, పరిసరాల ప్రభావంతో ముడిపడినవే సిగరెట్లు, బీడీలు, చుట్ట, గుట్కా, జర్దా లకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు శాకాహారం తినటం మేలు. మాంసాహారులైతే మితం పాటించాలి. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం వంటివి చేయాలి.