మంచిర్యాల జిల్లా
ఏప్రిల్ 21, 2023
✍️ మనోజ్ కుమార్ పాండే
మంచిర్యాల నియోజకవర్గంలో లక్షేట్టిపేట్ మండలం లోని బలరావుపేట, జెండా వెంకటాపురం, రంగపేట, ఉత్కూర్, మొదెల, ఇటిక్యాల, గుల్లకోట గ్రామాల్లో శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని. రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో DCMS డి.సి.ఎం.ఎస్.చైర్మన్ తిప్పని లింగన్న,లక్షేట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్, పార్టీ ప్రెసిడెంట్లు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.