మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
ఏప్రిల్ 22, 2023
✍️ మనోజ్ కుమార్ పాండే
బెల్లంపల్లి పట్టణ మెయిన్ బజార్ ఏరియాలోని యూనియన్(ఆంధ్ర)బ్యాంకు ఎదురుగా ప్రజల సౌకర్యార్థం 2020 సంవత్సరంలో పురపాలక సంఘం వారు సులభ్ టాయిలెట్ నిర్మించారు. ఏళ్లు గడచినా అదికారంగా ప్రారంభించకపోవడం వల్ల మార్కెట్ కు వొచ్చే ప్రజలు బ్యాంకు ఖాతాదారులు సులభ్ టాయిలెట్ ను ఉపోగించుకోవడం మూత్ర విసర్జన వల్ల అక్కడ సరిపడా నీటి సౌకర్యం లేక పరిశుద్ధత లేకపోవడం వలన భరించలేని దుర్వాసన వస్తుంది. బ్యాంకు కి వొచ్చే ఖాతాదారులకు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ పాలక వర్గం అధికారికంగా సులభ్ టాయ్లెట్ నీ ప్రారంభించి శానిటరీ సిబ్బంది ద్వార సులబ్ టాయిలెట్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేట్టు చర్యలు తీసుకోవాలని ప్రజలు బ్యాంక్ వినియోగారులు కోరుతున్నారు.