ప్రభుత్వం స్పందించకుంటే యూనియన్లకు అతీతంగా నిరసన

జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 22,2023

అర్హులైన జర్నలిస్టులకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నివేశన స్థలాలను వెంటనే మంజూరు చేసి గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించాలని సీనియర్ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధ్యావర సంజీవరాజు, జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఎన్ జైపాల్, వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం. ప్రదీప్ కుమార్, ఐ జె యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల నుండి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని పదేపదే వాగ్దానం చేస్తూ దాటవేత ధోరణి ఆలంబిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు ఇళ్లకి స్థలాల కేటాయింపుపై ఏటువంటి స్పందన లేకపోతే రాబోవు రోజుల్లో జర్నలిస్టులందరం యూనియన్లకు అతీతంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని నిరాహార దీక్షలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మాకు రాజలింగం, కోశాధికారి మేన్నెని శ్రీనివాసరావు,కళాశ్రీ గుండేటి రాజు, బెజ్జంకి సంపూర్ణ చారి, లక్ష్మారెడ్డి,ఆనంతుల కాంతారావు, తుమ్మ కిషోర్, లక్ష్మణ్, సిరిసిల్ల వేణుగోపాల్, కొత్తూరి మహేష్ కుమార్, రాజకుమార్, మహేష్ పటేల్, రేణికుంట శ్రీనువాసు,ఆముద లింగారెడ్డి,
కడలి మోహన్ రావు, రాజేశ్వర్ రెడ్డి, ఎం. ముఖేష్ రెడ్డి, అక్కినపల్లి బాబు, కాసం శ్రీనివాస్ రెడ్డి,
గణేష్ లవంగా, సిరిపురం శ్రీనివాస్, గోనె గంగాధర్, గౌరీశంకర్,బాస మహేష్ , రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

టీపెన్షనర్స్, సీనియర్ సిటిజన్ రాష్ట్ర కార్యదర్శి
హరి అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులందరికి ప్రభుత్వం ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీ పెన్షనర్స్, సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంను కోరారు. శనివారం జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలనే డిమాండ్ తో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని హరి ఆశోక్ కుమార్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

గత 40 ఏళ్లుగా జర్నలిస్టులు స్వంత ఇండ్లు లేక అద్దె ఇండ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.బస్ పాస్ లపై 100 శాతం రాయితీ కల్పించాలని, బస్ పాసుల్లో కుటుంబ సభ్యులు అందరికీ రాయితీ వర్తింపజేయలని,రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు జర్నలిస్టు బంధు ప్రకటించాలని,ఈ డిమాండ్లను తీరుస్తూ ఇండ్ల స్థలాలు సత్వరం కేటాయింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను కోరుతూ, అందుకు ప్రజా ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని కోరుతూ, తమ అసోసియేషన్స్ తరపున ప్రత్యేకంగా ప్రభు త్వాన్ని కోరారు.


టీపీసీసీ నాయకులు బండ శంకర్ మాట్లాడుతూ నాటి స్వాతంత్ర్య, నేటి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదాన్నారు. జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, అలాగే జర్నలిస్తులు ఆర్థికంగా నీలాదోక్కుకునేందుకు జర్నలిస్ట్ బంధు పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టుల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని శంకర్ ఆరోపించారు.

సంతకాల సేకరణకు శిబిరానికి వివిధ పార్టీల నాయకుల సంఫీభావం

జర్నలిస్ట్ ఇల్లు స్థలాల కోసం చేపట్టిన సంతకాల సేకరణ శిబిరాన్ని పలువురు పార్టీ నాయకులు సందర్శించి జర్నలిస్టులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు.

బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, వనమాల సత్యనారాయణ, జనార్దన్ రెడ్డి,రాజేందర్, టీడీపీ నాయకులు అక్కినపల్లి కాశీనాథం, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, గాజుల నగేష్ , బింగి రవి, నాయకులు రాంమోహన్ రావు, జగిత్యాల వర్తక సంఘం అధ్యక్షులు కమటాల శ్రీనివాస్, బిసి నాయకులు ఇట్టే సురేందర్, ఆకుల నాగరాజు, ముసిపట్ల లక్ష్మీ నారాయణ, పూర్వ విద్యార్థి నాయకులు ముష్కరి బాలాజీ ,వంజరి సంఘం నాయకులు పోతునుక మహేష్ ,రజినీకాంత్, అరె శంకర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు బోనగిరి దేవయ్య, డీజిల్ ఆటో సంక్షేమ సంఘం నాయకులు బొల్లి శేఖర్, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ దేవేందర్, నాయకులు పులి శ్రీధర్, బండారి మల్లికార్జున్, పులి నర్సయ్య తదితరులు జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల మంజూరు డిమాండ్ న్యాయమైందన్నారు.