ప్రజలందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలి

అర్పపల్లికి ఆర్టీసీ బస్ సేవలు పునరుద్దరణ

బస్సును ప్రారంభించిన డిఎం వెంకట నర్సప్ప

జగిత్యాల జిల్లా
అర్పపల్లి
ఏప్రిల్ 25,2023

ప్రజలందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ బి. వెంకట నర్సప్ప కోరారు.
జగిత్యాల జిల్లా కేంద్రం నుండి జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట మీదుగా సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామాలకు బస్సు సేవలను పునరుద్ధరిస్తున్నట్లు డిఎం బివి నర్సప్ప తెలిపారు. మంగళవారం అర్పపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో అర్పపల్లి బస్సును ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ వెంకట నర్సప్ప మాట్లాడుతూ…

ఆర్టీసీ సంస్థ అభివృద్ధిని వివరిస్తూ, ప్రజలందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని సూచించారు. రాయితీ బస్సు పాసుల వల్ల ప్రయాణికులకు కలిగే లాభాలను డిఎం వివరించారు.

ఈ కార్యక్రమంలో అర్పపల్లి, గుల్లపేట సర్పంచ్ లు శ్రీలత- ప్రభాకర్, తిరుపతి, ఉప సర్పంచ్ గూడ లింగారెడ్డి, అర్పపల్లి గ్రామ ప్రజలు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ విజయలక్ష్మి , టిఐ 2 సత్యనారాయణ, సిఆర్సి లు వినయ్ కుమార్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ ఆర్టీసి డియం

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ చెపడుతున్న చర్యల్లో భాగంగా బుధవారం ఉదయం 11గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ నర్సప్ప తెలిపారు.

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే నిమిత్తం, వారి సమస్యలు పరిష్కారం చేయుటకు, ప్రయాణికుల నుండి సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు 9959225925 నంబర్ కు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయాలన్నారు.