మెదక్ జిల్లా కేంద్రం
ఏప్రిల్ 25, 2023
✍️భైరవ్ రెడ్డి

యాసంగి 2022-23 కు ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పర్యవేక్షణ చేయుటకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల నుండి మిల్లుకు చేరే వరకు ఉన్న ప్రక్రియను పర్యవేక్షించుటకు, ఫిర్యాదుల పరిష్కారానికి ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేసేలా అధికారులకు విధులు కేటాయించామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, లారీలు, గొనె సంచుల మానిటరింగ్ కు 08452-223360 ల్యాండ్ నెంబరుకు సంప్రదించాలని సూచించారు. కొనుగోళ్ల ప్రక్రియ, లారీల మానిటరింగ్ కు 9885915768 మొబైల్ కు , గొనె సంచుల మానిటరింగ్ కు 9502989267 మొబైల్ కు కూడా సంప్రదించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎస్ ఓ శ్రీనివాస్, డిసిఓ కరుణ తదితరులు పాల్గొన్నారు.