జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 25,2013
గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ లోకిని రామ్ అన్నారు. జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ రాము ఆధ్వర్యంలో గంజాయి వల్ల జరిగే నష్టం గురించి ఆటోలకు మంగళవారం ఫ్లెక్సీలు కట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి ప్రజలకు అవగాహనా కల్పించారు.
నేటి యువతకు గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టంగూర్చి వివరించారు. ఆటోలకి ఫ్లెక్సీలను కట్టి 24 గంటలు జగిత్యాల పట్టణంలో అవగాహన ప్రచార కార్యక్రమాన్ని తన వంతు బాధ్యతగా చేపట్టారు.