జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 29, 2023
✍️కిషన్ రెడ్డి

శివపురాణం వినటం వల్ల పుష్కరస్నాన ఫలితం

వేదపండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ల విషు శర్మ

అలరిస్తున్న శివపురాణం

శివా పురాణం వినడం వల్ల పుష్కర స్నాన పలితం లభిస్తుందని వేద పండితులు, బ్రహ్మశ్రీ తిగుళ్ల విషుశర్మ అన్నారు. లోకాకల్యాణర్థం జగిత్యాలలో ఈనెల 24 నుండి నేటి వరకు శివ పురాణ ప్రవచనం కార్యక్రమం వేద పండితులు, బ్రహ్మశ్రీ తీగుళ్ల విశు శర్మ చే నడుస్తున్న శివపురాణం, ప్రవచన కార్యక్రమం శనివారం 6 వరోజు పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం మధ్య కొనసాగింది.
మహిళలు శివపురాణం సందర్భంగా ప్రతిరోజు వత్తులు వెలిగి స్తున్నారు.నిర్వాహకులు అశోక్ బాబు రమాదేవి దంపతులు భక్తులకు మధ్య మధ్య మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ద్వాదశ జ్యోతిర్లింగాల వైభవం, గంగ అవతరణ, భక్త సిరియాల చరిత్ర, ఘట్టాలను విశుశర్మ ఎంతో హృద్యంగా వివరించారు. ఈసందర్బంగా విషుశర్మ అభిభాషిస్తూ…
మేషరాషిలో గురు ప్రవేశించే సమయంలో గంగానదికి పుష్కరం ఏర్పడుతుందని, గంగానదికి వెళ్లే అవకాశం లేనివారికి శివపురాణం వినటం ద్వారా పలితం కలుగుతుందన్నారు.

కార్యక్రమనిర్వాకులు వూటు రి అశోక్ బాబు – రమాదేవి దంపతులకు వండర్ బుక్ అఫ్ రికార్డ్ అవార్డు పొందిన సందర్బంగా అంజలీ మీడియాఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, అంజలీ మీడియా జగిత్యాల మీడియా. జగిత్యాల జిల్లా మహిళా కో ఆర్డినేటర్ నమిలకొండ సాకేత,జిల్లా సాంస్కృతిక కో ఆర్డినేటర్ తవుటు రామచంద్రంలు ఘనంగా సన్మానించారు.అలాగే బ్రహ్మశ్రీ విషుశర్మ ను సాకేత శాలువాతో సన్మానించారు. ఆదివారం నాడు శివ కళ్యాణం జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అన్నదాన కార్యక్రమంతో శివపురాణం ముగుస్తుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని , అశోక్ బాబు, రమాదేవి దంపతులు కోరారు.

ఈ కార్యక్రమంలో బొల్లం చంద్ర ప్రకాష్ గుప్తా, రేవతి , బొల్లం వంశీకృష్ణ, స్పందన, రేణిగుంట రామారావు, మాజీ కౌన్సిలర్ రేపల్లె హరికృష్ణ,
ఉమా దేవి, ఉమాశంకర్, సృజన , ఊటూరి ఓంకార్ నాథ్, మమత, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, ఊటూరిబ్రదర్స్ , దాస బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.