మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మెదక్ జిల్లా నిజాంపేట నుండి రామయంపేట వరకు బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి పంజా విజయ్ కుమార్ నేడు పాదయాత్రను చేపట్టారు.
మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని నిజాంపేట నుండి రామాయంపేట వరకు పాదయాత్ర చేపట్టిన నిజాంపేట టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్. రామాయంపేటలో గత 59 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అఖిలపక్షం నాయకులకు మరియు జేఏసీ నాయకులకు ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా రామాయంపేటలో జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ…

రామాయంపేట నియోజకవర్గంలో గతంలో టి. అంజయ్య ముఖ్యమంత్రిని అందించిన ఘన చరిత్ర రామాయపేట నియోజకవర్గానికి ఉందని కానీ ప్రస్తుతం రామాయంపేట ఒక చిన్న మండలంగా ఉందని రామాయంపేట నియోజకవర్గం కోల్పోయి మెదక్ నియోజకవర్గంలో డిలిమిటేషన్ కలిసిపోయిందని రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రామాయంపేట ప్రస్తుతం అభివృద్ధిలో వెనుకంజులో ఉందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని, బస్ డిపో నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన ఇంత వరకు నిర్మాణం జరగలేదని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యులు, వైద్య సిబ్బంది లేరని, విద్య వైద్యం పేద బడుగు బలహీన వర్గాలకు అందాలని అలా జరగాలంటే మార్పు జరగాలని రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే రామాయంపేట ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

ప్రస్తుత ఏ ప్రాంత ప్రతినిధులు విస్మరించారని సీఎం కేసీఆర్ కు ఈ విషయం చేరేవరకు తాను రామాయంపేట డివిజన్ కోసం కృషి చేస్తానని జడ్పిటిసి పంజా విజయ్ కుమార్ అన్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు రెవెన్యూ డివిజన్ పై పట్టించుకోకపోవడం వల్ల తాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లేందుకే ఈ పాదయాత్ర చేస్తున్నట్టు ఆయన తెలిపారు.