పోగాకు వాడకంతో క్యాన్సర్ బారినపడే ప్రమాదం – జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల, మే 31,2023

పోగాకు వాడకంతో ప్రజలు వివిధ రకాల రోగాలతో పాటు క్యాన్సర్ బారినపడే ప్రమాదముందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాలకూ చెందిన సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రo రూపొందించిన అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం కరపత్రాలను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ…

పొగాకుతో పాటు పొగాకుతో తయారుచేయబడిన వస్తువులు వాడడం వలన అనేకమైన ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లాంటి అనేక రోగాలకు ప్రజానీకం బలవుతున్నారని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

లక్షలాదిమంది అకాల మరణాలకు ఈ పొగాకు అలవాటే మూల కారణమని స్కాట్లాండ్కు చెందిన ధూమపాన నిర్మూలన సంస్థ మెడికల్ డైరెక్టర్ కొన్ని ఏళ్ళ క్రితమే తేల్చి చెప్పారని, పొగాకును నియంత్రించకుంటే , ఏటా కోటికి పైగా ప్రాణాలు గాల్లో కలుస్తాయని భారత్ లోని ప్రజారోగ్య ఫౌండేషన్ కూడ సంస్థ హెచ్చరించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పొగ తాగే వారిని గుండె జబ్బులు, క్షయ ,అందత్వం, వ్యo దత్వం, క్యాన్సర్, వంటి మహమ్మార్లు ముకుమ్మడిగా చుట్టు ముడుతున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయని తవుట్ రామచంద్రం అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సుమన్ రావు, డాక్టర్ ధనుంజయ్, అశోక్ రావు, పాళ్తెపు శంకర్ ,గట్ల చంద్రయ్య , నవదుర్గ సేవాసమితి సభ్యులు, ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.