లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై నోరుమెదపని బీజేపీ నేతలు
మాస్టర్ ప్లాన్ పై జగిత్యాల ఎమ్మెల్యే అధికారుల పొరపాటు అనడం ఆశ్చర్యం
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల : మే 31,2023
బీజేపీ, బారాస మైత్రి చైనా మాంజా లాగా గట్టిదని ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు విషయంలో రుజువైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల మాస్టారు ప్లాన్ రూపాకల్పనలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నితానై ఉండి చేశారని, ఇప్పుడు అధికారులను తప్పుపట్టడం ఆశ్చర్యకరమన్నారు. మాస్టర్ ప్లాన్ ఉపసంహరణను స్వాగతిస్తున్నామని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
బుధవారం జగిత్యాలలో విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ…
న్యాయస్థానంలోని వివాదాలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఏం చర్యలు చేపట్టారో శ్వేత పత్రం ప్రకటించాలన్నారు. నాలుగున్నరేల్లుగా యావర్ రోడ్డు విస్తరణకు ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. 1989లో జీవో 149 ప్రకారం జారీ చేసిన మాస్టర్ ప్లాన్లు స్పష్టత లోపించడంతో అనుమతులు పొందడంలో ఇబ్బందుల దృస్ట్యా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవ తీసుకొని కర్త కర్మ క్రియగా మాస్టర్ ప్లాన్ రూపొందించారన్నారు. డిసెంబర్ 15, 2022లో జీవో నెంబర్ 238 ప్రకారం జారీ చేసిన మాస్టర్ ప్లాన్ తో ప్రభావిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందారని, మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కర్త, కర్మ,క్రియగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ముందు వరుసలో ఉండి అధికారుల నిర్లక్ష్యం పొరపాటు అనడం ఆశ్చర్యకరమన్నారు. మాస్టర్ ప్లాన్ జీవో ఉపసంహరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. బిజెపి, బీఆర్ఎస్ మధ్య గతంలో ఉన్న మైత్రి బంధం కొనసాగుతోందని వీరు ఇరువురి మధ్య అంతర్గత ఒప్పందం ఉందనీ బిజెపి నాయకులే అంటున్నారన్నారు.
లిక్కర్స్ స్కాంలో కవిత పాత్ర ఆధారాలతో వెలుగు చూస్తున్న సిబిఐ మెతకధోరణి బిజెపి, బిఆర్ఎస్ మైత్రికి నిదర్శనం అన్నారు. తెలంగాణలో లిక్కర్ మేనేజ్మెంట్ పాఠాలు ఢిల్లీ వాళ్లకు నేర్పేందుకు వెళ్లారు అని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర పై నిన్న, మొన్నటి వరకు బండి సంజయ్, అరవింద్ కుమార్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజలు విజ్ఞులని, అన్ని గమనిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ వాస్తవ దృక్పథంతో మాట్లాడారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీకి గ్రామ గ్రామ క్షీరాభిషేకం చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో గిరి నాగభూషణం, బండ శంకర్, దుర్గయ్య, రాధాకిషన్, మహిపాల్ లు పాల్గొన్నారు.