మెదక్ జిల్లా
జూన్ 02,2023
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెదక్ పట్టణంలోని జిల్లా న్యాయస్థానం వద్ద గౌరవ శ్రీమతి పి లక్ష్మీ శారద గారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్ జడ్జ్ మెదక్ గారు మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగర వేశారు అనంతరం న్యాయవాదులు, కోర్టు సిబంది అందరితో కలిసి జాతీయ మరియు తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సి.హెచ్. జితేందర్ గారు సీనియర్ సివిల్ జడ్జ్ మెదక్, శ్రీమతి. రిట లాల్ చంద్ గారు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి మెదక్, శ్రీమతి కల్పన గారు జూనియర్ సివిల్ జడ్జి మెదక్, శ్రీ జన్నా రెడ్డి గారు ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మెదక్, శ్రీ. షేక్ ఫజాల్ అహ్మద్ గారు జిల్లా కోర్టు పి.పి. శ్రీ .ఎస్. శ్రీనివాస్ గారు గవర్నమెంట్ ప్లీడర్ పలువురు న్యాయవాదులతో పాటు కోర్టు సిబ్బంది పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.