జగిత్యాల జిల్లా
జూన్ 2,2023
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించి గౌరవించాలని జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘాల నాయకులు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అనంతరం జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ నాయకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ…
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. అలాంటి జర్నలిస్టులను ఈ ఉత్సవాల్లో చిన్నచూపు చూస్తున్నట్లుగా భావిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. జూన్ 2 నుండి 22 వరకు జరిగే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని, కవులు, కళాకారులను కూడా ప్రభుత్వం గౌరవిస్తుందని, అలాగే జర్నలిస్టులను కూడా ఈ ఉత్సవాలలో ఒక రోజు గౌరవించే విధంగా చర్యలు చేపట్టాలని సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.
మంత్రిని కలిసిన వారిలో జర్నలిస్టు సంఘాల నాయకులు బండ స్వామి, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, ముక్క వేణు, ఎల్లాల రాజేందర్ రెడ్డి,కందుకూరి శశిధర్, బెజ్జంకి సంపూర్ణ చారి, బొడ్డుపెళ్లి అంజయ్య తో పాటు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్. జయపాల్ తదితరులు ఉన్నారు.