తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, డా.సంజయ్ కుమార్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ గారు, కలెక్టర్ యాస్మీన్ భాషా గారు,ఎస్పీ భాస్కర్ గారు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్, DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత గారు, మంద మకరంద్ గారు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటీ వెంకట్ రావు, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, డి.ఎస్పిలు, సి.ఐలు,ఎస్. ఐలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు….

తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే మార్గ నిర్దేశకంగా నిలిచిందన్నారు. పోలీస్ శాఖకు ఊహించని విధంగా బడ్జెట్ కేటాయించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశారని తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్స్ సెంటర్(CCC) తో నిఘా వ్యవస్థ మెరుగై ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది అన్నారు.
