గిరిజన రిజర్వేషన్ లను 9వ సేడ్డ్యుల్ లో చేర్చాలి.
20 న ఇందిర పార్క్ వద్ద ఎల్.హెచ్.పి.ఎస్ మహా ధర్నా! హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో కరపత్రాల ఆవిష్కరణ!
ఎల్.హెచ్.పి.ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్.

ఈరోజు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో లంబాడీ హక్కుల పోరాట సమితి మరియు గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 20 న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్, ఇందిర పార్క్ వద్ద మహా ధర్నా కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎల్.హెచ్.పి.ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక సమన్వయకర్త జాటోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రం లో 7 సంవత్సరాల పోరాట పలితంగా సాధించిన 10 శాతం గిరిజన రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం 9వ షేడ్డ్యుల్ లో చేర్చి రక్షణ కల్పించాలని మరియు రాజ్యాంగ వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం 11 బి.సి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు.

జి. ఓ నంబర్ 3 మరియు 1/70 చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి ఐ. టి.డి. ఏ లతో పాటు గ్రామ పంచాయతీలుగా మార్చిన తండాలను రెవెన్యూ పంచాయతీ లు గా మార్చి బడ్జెట్ కేటాయిపులు చేయాలని డిమాండ్ చేశారు మరియు ఈ నెల 20 న ఇందిర పార్క్ వద్ద జరుగు మహా ధర్నా ను తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు అజ్మీరా వెంకట్, వరంగల్ జిల్లా అధ్యక్షులు బాణోత్ సునీల్ నాయక్, జనగామ జిల్లా ఇంఛార్జి బానోతు వసంత్ నాయక్, బుపాలపల్లి జిల్లా ఇంఛార్జి అజ్మీరా పుల్సింగ్ నాయక్, మహబూబాబాద్ జిల్లా ఇంఛార్జి జాటోత్ బాలు నాయక్, ములుగు జిల్లా ప్రతినిధి అజ్మీరా పడ్తి నాయక్ తదితరులు పాల్గొన్నారు.