ఈరోజు జిల్లా మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి గారు మాట్లాడుతూ…

మాదకద్రవ్యాలు నిర్మూలించడం మన అందరి బాధ్యత అని ఈ మాదకద్రవ్యాల వాడకం వల్ల ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అలాగే యుక్తవయసులోనూ ఉన్న యువతి యువకులు ఈ డ్రగ్స్ ను తీసుకొని వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాటిపై అవగాహన కలిగించి వాటిని నిర్మూలించడం మన అందరి బాధ్యత అని చెప్పడం జరిగింది.

అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా డీఎస్పీ సైదులు సార్ గారు మాట్లాడుతూ….

డ్రగ్స్ ను యుక్త వయసు వారే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్తలు సెలబ్రిటీలు కూడా వాడుతున్నారని అలాంటి వాటికి యువకులు దూరంగా ఉండి వాటిని నిర్మూలించాలని తెలియజేశారు. నేటి యువకులే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి అలాంటి దుర అలవాట్లకు దూరంగా ఉండి వారి కుటుంబాలను మరియు తోటి వారి జీవితాలను కూడా కాపాడాల్సిన బాధ్యత యువకులపై ఉందని చెప్పడం జరిగింది అంతకుముందు మెదక్ లోని రాందాస్ చౌరస్తా నుండి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు యువకులు అధికారులు కలిసి ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీకి జిల్లా డిఎస్పి సార్ గారు పచ్చ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ మేడం గారు జిల్లా డీఎస్పీ సైదులు సార్ గారు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ నవీన్ సార్ డిఐఇఓ సత్యనారాయణ సార్ గారు విజన్ ఎన్జీవో అపర్ణ మేడం గారు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ గారు ఈవో పద్మలత మేడం గారు మెదక్ లోని వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.