తెలంగాణ నేతను అభినందించిన జర్నలిస్ట్ నాయకులు
జగిత్యాల జిల్లా
జూలై 25,2023
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన స్టూడియో 18 సీఈఓ భరత్ కుమార్ శర్మ ఎన్నికయ్యారు.
132 వ నేషనల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మరో పదవి లభించింది. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ ప్రతిపాదనల మేరకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పాండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణకు చెందిన భరత్ కుమార్ శర్మకు ఐఎఫ్డబ్ల్యూజే అడిషనల్ జనరల్ సెక్రెటరీగా అవకాశం కల్పించారు. తక్షణమే ఈ పదవి అమలులోకి వస్తుందని జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పాండేజీ తెలిపారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ టిఐజేయూ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొనసాగుతున్న భరత్ కుమార్ శర్మను జాతీయ నాయకత్వం గుర్తించి నియామకం చేసిన ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ అధ్యక్షులు, కార్యవర్గానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణకు పెద్ద పదవిలో నియామకం చేసినందుకు జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య, కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల ప్రెస్ క్లబ్ సాంస్కృతిక కార్యదర్శి , కళాశ్రీ అధినేత గుండేటి రాజు లు భరత్ కుమార్ శర్మను అభినందించారు.